ఏపీ రాజకీయాల్లో మళ్లీ తోట చంద్రశేఖర్.. పవన్తో భేటీ వెనుక వ్యూహమేంటి?
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ భేటీ
- మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంతో రాజకీయ చర్చలు
- గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న తోట చంద్రశేఖర్
- ఆయన తిరిగి జనసేనలో చేరవచ్చని మొదలైన ఊహాగానాలు
- ప్రజారాజ్యం నుంచి బీఆర్ఎస్ వరకు సాగిన తోట రాజకీయ ప్రస్థానం
ఏపీ రాజకీయాల్లో మాజీ ఐఏఎస్ అధికారి, సీనియర్ నేత తోట చంద్రశేఖర్ మరోసారి ఆసక్తికర చర్చకు తెరలేపారు. గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన, అనూహ్యంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన రానప్పటికీ, తోట చంద్రశేఖర్ తిరిగి జనసేనలో చేరబోతున్నారనే ఊహాగానాలకు ఈ సమావేశం బలం చేకూర్చింది.
తోట చంద్రశేఖర్ రాజకీయ ప్రస్థానం విలక్షణమైనది. మహారాష్ట్ర కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఆయన, 2008లో తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో వ్యవస్థాపక దశ నుంచి కీలక పాత్ర పోషించి, మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అనంతరం తన రాజకీయ ప్రస్థానాన్ని జనసేన వైపు మళ్లించారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి మరోసారి పరాజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత జనసేనకు దూరమై, సుమారు మూడేళ్ల క్రితం అనూహ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తోట చంద్రశేఖర్ ఆ పార్టీకి, క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.
ఇప్పుడు ఏపీలో జనసేన అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న తరుణంలో పవన్ కల్యాణ్తో ఆయన భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమా? లేక రాజకీయ పునఃప్రవేశానికి సంకేతమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, సుదీర్ఘకాలం తర్వాత నేరుగా జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్ను కలవడంతో ఆయన రీఎంట్రీ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ రాజకీయ ఊహాగానాలపై తోట చంద్రశేఖర్ స్పందిస్తేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తోట చంద్రశేఖర్ రాజకీయ ప్రస్థానం విలక్షణమైనది. మహారాష్ట్ర కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఆయన, 2008లో తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో వ్యవస్థాపక దశ నుంచి కీలక పాత్ర పోషించి, మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అనంతరం తన రాజకీయ ప్రస్థానాన్ని జనసేన వైపు మళ్లించారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి మరోసారి పరాజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత జనసేనకు దూరమై, సుమారు మూడేళ్ల క్రితం అనూహ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తోట చంద్రశేఖర్ ఆ పార్టీకి, క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.
ఇప్పుడు ఏపీలో జనసేన అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న తరుణంలో పవన్ కల్యాణ్తో ఆయన భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమా? లేక రాజకీయ పునఃప్రవేశానికి సంకేతమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, సుదీర్ఘకాలం తర్వాత నేరుగా జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్ను కలవడంతో ఆయన రీఎంట్రీ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ రాజకీయ ఊహాగానాలపై తోట చంద్రశేఖర్ స్పందిస్తేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.